ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

-

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను తాజాగా విడుదల చేసింది బీజేపీ. ఎచ్చెర్ల- ఈశ్వరరావు, విశాఖ నార్త్ – విష్ణుకుమార్ , అరకు-  రాజారావు, అనపర్తి- శివకృష్ణంరాజు, కైకలూరు-కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి, బద్వేల్ -బొజ్జ రోశన్న, జమ్మల మడుగు- ఆదినారాయణరెడ్డి, ఆదోని-పార్థసారధ, ధర్మవరం-వై సత్యకుమార్ లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తం ఏపీలో 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. 

ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు బీజేపీ తిరుపతి ఎంపీ సీటు కేటాయించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి లోక్‍‌సభ స్థానం నుంచి సీఎం రమేష్, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నర్సాపురం నుంచి శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version