విశాఖ డ్రగ్స్ కేసు పై స్పందించిన సీఎం జగన్

-

విశాఖ డ్రగ్స్ కేసు పై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. చంద్రబాబు వదినగారు పురంధేశ్వరి చుట్టం కంపెనీలో డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది. దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే.. సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి అని జగన్ మండిపడ్డారు.

ప్రజల మద్దతులేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. బాబు నాపై బురద జల్లీ రాజకీయం చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు దిట్ట.అబద్దాలు చెప్పే వారు, కుట్రలు చేసే వారు మన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు, ఫీజు రీయంబర్స్ మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన కొనసాగాలంటే జగన్ రావాలని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అని సూచించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version