ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

-

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కకడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ నుండి కారు తుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైవర్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఇంకా  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version