చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే : సీఎం జగన్

-

చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమేనని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా పెదకూరపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ కి ఓటు వేస్తే.. మళ్లీ పథకాలన్నీ కొనసాగుతాయి. కానీ చంద్రబాబు కు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే అన్నారు. ముఖ్యంగా పిల్లల చేతుల్లో ట్యాబ్ లు ఎప్పుడైనా మీరు చూశారా..? చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.. ఏం చేశాడు అని ప్రశ్నించారు.

గతంలో మేనిఫెస్టో పేరతో ఎలా మోసం చేశారో మీరు చూశారు. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారా..? గతంలో ఎన్నడూ చూడని పాలనను ఈ 59 నెలల్లో చూశారు. ప్రత్యేక హోదాను అమ్మేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు అన్నారు. అమలు చేయలేదు. ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్లీ మేనిఫెస్టో అని.. సూపర్ సిక్స్ అని, ఇంటింటికి కేజీ బంగారం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version