పవన్ కళ్యాణ్ విమర్శలకు వంగ గీత స్ట్రాంగ్ కౌంటర్

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు.  జనసేన చీఫ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ శనివారం చేసిన విమర్శలకు తాజాగా వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.

ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనడం సరికాదని మండిపడ్డారు. తన హయాంలోనే వంద ఆలయాలను అభివృద్ధి చేశా అన్నారు. ప్రజలకు పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చెప్పాలన్నారు. లక్ష మెజార్టీతో పవన్ కల్యాణ్ మీద గెలవబోతున్నామన్నారు. సినిమా డైలాగులు రియల్ పాలిటిక్స్ లో పని చేయవన్నారు. ప్రాస కోసం ఏది పడితే అది మాట్లాడితే బాగోదన్నారు. లక్ష మెజార్టీ తమదే అని.. తమ కార్యకర్తలు కూడా కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు వంగ గీత.

Read more RELATED
Recommended to you

Latest news