చంద్రబాబుకు నిద్రపోయే అవకాశం లేకుండా చేసిన ఏపీ పోలీసులు !

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిద్రపోయే అవకాశం లేకుండా చేస్తున్నారు ఏపీ పోలీసులు. విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఏసీబీ కోర్టుకు కాకుండా తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ సిద్దం కాకపోవడం వల్లే ఏసీబీ కోర్టుకు కాకుండా తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది.

chandrababu

కాగా, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు టిడిపి నేతలు. దీంతో ఈ దీక్షలకు హాజరుకాకుండా నాయకుల ఇళ్ల వద్ద భారీగా చేరుకున్నారు ఏపీ పోలీసులు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి..నారాయణ…టీడీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version