గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసులపై వేటు పడింది. గోరంట్ల మాధవ్ కు ఎస్కార్ట్గా ఉన్న 12 మంది గుంటూరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడించారు.

సస్పెన్షన్కు గురైనవారిలో అరండల్పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం, నగరంపాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్సైలు ఆంథోని, ఏడుకొండలు, నగరంపాలెం స్టేషన్కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్పేటకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు.
- గోరంట్ల మాధవ్ వ్యవహారం.. 12 మంది పోలీసులపై వేటు
- సస్పెన్షన్కు గురైనవారిలో అరండల్పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం, నగరంపాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్సైలు ఆంథోని, ఏడుకొండలు, నగరంపాలెం స్టేషన్కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్పేటకు చెందిన ఒక కానిస్టేబుల్