వచ్చే ఏడాది ఏప్రిల్ 14 లోపు ఏపీలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

-

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరపనున్నారు. కాగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున, అధికారుల బృందం హర్యానా వెళ్లి అక్కడ స్టూడియోలో ఈ విగ్రహ నమూనాను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఏపీలో ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, విగ్రహ నిర్మాణ పనులను ప్రతి రోజు సమీక్షించడం జరుగుతోందని వివరించారు. విగ్రహ నిర్మాణ పనుల్లో ఎక్కడ జాప్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version