రైతులకు జగన్ గుడ్ న్యూస్: వ్యవసాయ రంగానికి రూ.16,321 కోట్లు !

-

అగ్రి ఇన్‌ఫ్రా ‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతులకు జగన్‌ శుభవార్త చెప్పారు. ఈ సమీక్ష అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

వ్యవసాయ రంగంలో మౌలిక సుదపాయల కల్పన కోసం తమ సర్కార్‌ దాదాపు రూ.16,320.83 కోట్లు ఖర్చు చేస్తోందని ప్రకటన చేశారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో భారీ ఎత్తున మౌళిక సదుపాయాలు కల్పించాలని.. సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలని.. క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలని.. ప్రపంచంలో ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్‌ సెంటర్‌ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version