ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై కేకే సర్వే సంచలన విషయాలను బయటపెట్టింది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పకనే చెప్పిందట సర్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం.. దాటిన నేపథ్యంలో… కేకే సర్వే.. ఓ సంచలన రిపోర్టు బయట పెట్టినట్లు తెలుస్తోంది.

ఇందులో టిడిపి పార్టీ నుంచి కొత్తగా గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని కేకే సర్వే స్పష్టం చేసిందట. ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం కేకే సర్వే వెల్లడించలేదు. ఇదే కేకే సర్వే 2024 ఎన్నికల్లో కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని… జనసేన బంపర్ బంపర్ అందుకుంటుందని పేర్కొంది. కానీ ఇప్పుడు అదే కేకే సర్వే… 40 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెబుతోంది. దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు టెన్షన్ పడుతున్నారు.
టీడీపీ నుండి కొత్తగా గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఓడి పోతారు – KK సర్వే pic.twitter.com/A7cB9qlSXL
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2025