కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ కు కల్వకుంట్ల కవిత వెళ్లారు. తన భర్త అనిల్ తో కలిసి ఎర్రవల్లి లోని కెసిఆర్ ఫామ్ హౌస్ కు… కవిత వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ తో సమావేశం అయ్యారు కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలోనే లేఖ వివాదం అలాగే కాలేశ్వరం విచారణపై కూడా చర్చిస్తున్నారు.

అలాగే ఇవాళ కాలేశ్వరం విచారణ ముందుకు కేసిఆర్ వెళ్లబోతున్నారు. దానిపై ఆరా తీశారు కల్వకుంట్ల కవిత. అయితే మొన్నటి వరకు… కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని.. పదేపదే చెప్పిన కల్వకుంట్ల కవిత.. మల్లి కేసీఆర్ వద్దకే ఆమె వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అటు.. గులాబీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ… కల్వకుంట్ల కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఫ్యామిలీ కలిసి పోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ఫామ్హౌస్కు కవిత
ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న కేసీఆర్
ఈ క్రమంలోనే తండ్రి కేసీఆర్ను కలిసిన కవిత
లేఖ వివాదం తర్వాత తొలిసారి కేసీఆర్ను కలిసిన కవిత https://t.co/KFYSJJCR0Q pic.twitter.com/8kRNf6C1zc
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2025