భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 71% పూర్తి : రామ్మోహన్‌ నాయుడు

-

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఇవాళ ఏపీలో పర్యటించారు. భోగాపురంలో పర్యటించిన ఆయన అక్కడ విమానాశ్రయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు పలు విషయాలపై కేంద్రమంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విమానాశ్రయం పనులు 71శాతం పూర్తయ్యాయని (Rammohan Naidu) తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందని వెల్లడించారు. దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అతి అధునాతనమైనదని అన్నారు. ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళా నిలయం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంట మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సహా పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news