విశాఖలో దారుణం..ప్రియురాలిని హత్య చేసిన లవర్

-

విశాఖ పట్నం లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్థరాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలోనే.. గాజువాక పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్టు సమాచారం అందుతోంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కె శ్రావణి అనే వివాహిత ను హత్య చేశాడు పరవాడ కు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు. అర్థరాత్రి మూడు గంటల సమయంలో బీచ్ కు వచ్చారు శ్రావణి, గోపాలకృష్ణ. ఇరువురు మధ్య వాగ్వాదం జరగడంతో శ్రావణిని హత్య చేశాడు గోపాలకృష్ణ. జగదాంబ లో ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్న శ్రావణిని… గోపాలకృష్ణ ప్రేమిస్తున్నాడు. అయితే.. వీరి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మహిళను గోపాలకృష్ణ హత్య చేశాడు. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version