ఏపీలో “జగనన్నకు చెబుతాం” అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం !

-

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక ఫోన్ లైన్ ద్వారా తెలియజేయడానికి ప్రభుత్వం ” జగనన్నకి చెబుతాం” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమాన్ని నవంబర్ రెండవ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా కేటాయించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న దానికి రకరకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ కనెక్ట్ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ కొత్త కార్యక్రమం ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news