బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!

-

కృష్ణాజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మహేంద్ర థార్ లో గన్నవరం – కేసరపల్లి రూట్ లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు. ఆదివారం వరద నీటిలో చిక్కుకున్న కారును గుర్తించిన అధికారులు కారు బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

కారును గుర్తించినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న రాత్రి నుంచి ఫణి ఆచూకీ లభ్యం కాకపోవడంతో భారీగా ప్రవహిస్తున్న బుడమేరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కారు మునిగిన చోటుకు దగ్గరలో చెట్లకు చిక్కుకుని ఉన్న ఫణి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.

రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా.. నేడు మృతదేహాన్ని గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కృష్ణాజిల్లా పెడన ఫణి స్వస్థలం కావడంతో రెండు రోజుల క్రితం అక్కడికి వెళుతూ బుడమేరులో గల్లంతు అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news