జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన ఏసీ బోగీల లింక్‌

-

ఏపీలో ఓ సూపర్ ఫాస్ట్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. విశాఖ – విజయవాడ జన్మభూమి సూపర్‌ఫాస్ట్ విశాఖలోనే నిలిచిపోయింది. ఉదయం 6 గంటల 20 నిమిషాలకు రైలు బయల్దేరింది. కాగా బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ తెగిపోయింది. 2 బోగీలను స్టేషన్‌లోనే వదిలి జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ముందుకెళ్లింది.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును విశాఖ స్టేషన్‌కు తిరిగి తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని వెల్లడించారు. రైలు ఆలస్యంతో ప్రయాణికులు 2-3 గంటలుగా స్టేషన్‌లోనే ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 3 గంటల నుంచి రైల్వే స్టేషన్లోనే వేచి చూస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. తమ గమ్యస్థానానికి అనుకున్న సమయానికి చేరలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమ ప్రయాణానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version