ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చన్న.. ఆరోజున అధికారిక ప్రకటన !

-

తెలుగుదేశం పార్టీలో మళ్ళీ పదవుల పందేరం మొదలైంది. ఏపీలో జగన్ పార్టీ దూకుడుకు పార్టీ నేతలలో భయాందోళనలు పెరిగిపోతుండటంతో ఎప్పటి కప్పుడు పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచే విధంగా చంద్రబాబు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏపీలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చంద్రబాబు హడావుడి చేశారు. కేంద్రం కూడా జమిలి ఎన్నికల విషయంలో అదే ఊపులో ఉండడంతో చంద్రబాబు మాత్రం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే జమిలి ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు.

atchannaidu
atchannaidu

అయితే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా కింజరాపు అచ్చెన్నని నియమించినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న టీడీపీ అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27 వ తారీఖున అన్ని కమిటీలని టిడిపి ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు త్వరలోనే మండల జిల్లా కార్యవర్గాల ను పూర్తిగా ప్రక్షాళన చేసి, ఉత్సాహవంతులైన వారికి ఆ పదవులను కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోనే ఈ కమిటీలు రేడీ చేసినట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news