పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉంది – అంబటి

-

పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడని ఆగ్రహించారు.

పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది.. ఇది బాగుందా? అని నిలదీశారు. మర్యాదలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పవన్‌ చాలా మర్యాదగా మాట్లాడారు.. మళ్లీ ఎప్పుడు వస్తారు ? అని ఫైర్‌ అయ్యారు అంబటి రాంబాబు. పవన్ కల్యాణ్‌ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడని నిప్పులు చెరిగారు. వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ పాపాలు కొన్ని అయినా కొట్టుకుపోతాయని చెప్పారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news