నేడు తిరుమలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

-

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈరోజు (మే 30వ తేదీ) తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని వకుళా మాత అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది.

అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నాలుగు జుల్లో ఎన్నికల ఫలితాలు ఉండటంతో తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకునేందుకు అమిత్ షా వస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందనే ధీమాతో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయి హ్యాట్రిక్ కొడతారని మొదటి నుంచి బీజేపీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరి భవిష్యత్ ఏంటో తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version