ఏపీ కరోనా కేసులు.. జిల్లాల వారీగా ఎన్నంటే ?

-

తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,553 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యా రోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 639302కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 51 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5461కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71465 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.


నేడు కొత్తగా 10,555 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 562376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే కృష్ణాలో 9, అనంతపూర్ 6, చిత్తూరు 8, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 1, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 3, నెల్లూరు 3గురు కరోనా వల్ల మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news