ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్… చంద్రబాబు అదిరిపోయే శుభవార్త

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్త అందించారు. ఏపీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.

anna-canteen
anna-canteen

ఈ మేరకు తాజాగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ 31 అంశాలను ఎజెండాగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు… అన్న క్యాంటీన్ ల గురించి కీలక ప్రకటన చేశారు. ప్రతి మండలంలో నిర్వహిస్తామని వివరించారు.

ఇక వీటి నిర్వహణ, విరాళాలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని సూచనలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు అన్నా క్యాంటీన్లు కేవలం నగరాలు, పట్టణాలు అలాగే నియోజకవర్గ కేంద్రాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇకపై ఈ ఐదు రూపాయల భోజనం ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news