వచ్చే నెల నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం : మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి

-

ఎన్నికల హామీలో  మేము చెప్పినట్టుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా వచ్చే నెల నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఉచితంగా ఇసుక కూడా అందిస్తున్నాం. రవాణ చెక్ పోస్టులను గత ప్రభుత్వం మూసేసింది.

చెక్ పోస్టులను రీ-ఓపెన్ చేసే అంశంపై త్వరలోనే ఓ సమావేశం పెడతామని తెలిపారు. చెక్ పోస్టులను తిరిగి తెరిచే విషయమై అధికారులతో సమావేశమై.. త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్ సేవలు కల్పించనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news