ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన రావాలి – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

-

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన రావాలి డిమాండ్‌ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర వైసీపీ నాయకులు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆగ్రహించారు.

Annamreddy Adeep Raj on tdp govrnement

నెరవేర్చలేని హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది….ఈ పాలనలో ప్రజలందరూ భయాందోళనలో బతుకుతున్నారన్నారు. అధికారమనేది ఎవరికి శాశ్వతం కాదు వైసిపి కార్యకర్తలను మద్దతుదారులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని తెలిపారు. మా ప్రభుత్వంలో ఎప్పుడు మేము ఇటువంటి చర్యలకు పాల్పడలేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలని కోరారు. వీరు చేసే అన్యాయాలు మీద రేపు ఢిల్లీలో జరిగే మహా ధర్నాలో వైసిపి ఎమ్మెల్యేలు మరియు మంత్రులు పాల్గొంటామని చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news