Annadata Sukhibhava: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 21న ‘అన్నదాత’ సుఖీభవ’ తొలి విడత నిధులు

-

AP Annadata Sukhibhava Scheme:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు… చంద్రబాబు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జూన్ 21వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు 2000 కు… రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రూపాయలు జమ చేయబోతున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంటే 21న ‘అన్నదాత’ సుఖీభవ’ తొలి విడత నిధులు కానున్నాయి.

AP Annadata Sukhibhava Scheme:
AP Annadata Sukhibhava Scheme:

అక్టోబర్ లో రెండో విడత అలాగే వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని సమాచారం అందుతుంది. పీఎం కిసాన్ డబ్బు జమ తేది మారితే అనుగుణంగా ఆ డేట్ కూడా మారే అవకాశం ఉంది. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలను గుర్తించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

అటు రైతులకు శుభవార్త అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లుగా కేంద్రం ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. కిసాన్ సన్మాన్ నిధి డబ్బులను ఈ నెల 3 వ వారంలోనే రైతుల అకౌంట్లోకి వేయనున్నట్లుగా స్పష్టం చేశారు. అన్నదాతలకు కేంద్రం మూడు విడతల్లో రూ. 6000 సాయం అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news