Thalliki Vandanam Scheme 2025: నేటి నుంచే “తల్లికి వందనం” అమలు… 67.27 లక్షల మందికి లబ్ది

-

Thalliki Vandanam Scheme 2025:   ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేటి నుంచే “తల్లికి వందనం” అమలు కానుంది. ఏపీలో మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో రూ,8745 కోట్ల నిధులు జమ చేయనుంది కూటమి సర్కార్.

Thalliki Vandanam Scheme 2025
Thalliki Vandanam Scheme 2025

సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాం టీన్, మెగా డీఎ స్సీ, దీపం-2 పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం…. ఇక నేటి నుంచే “తల్లికి వందనం” అమలు చేయనుంది. ఇక దీనిపై లోకేష్ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మహిళలకు కానుకగా తల్లికి వందనం అన్నారు మంత్రి నారా లోకేష్. చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం అందుతుంది… తల్లికి వందనం అమలుతో సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ నేరవేరిందని పేర్కొన్నారు మంత్రి లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news