ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందజేసింది. విద్యార్థులకు మరింత రుచికరంగా భోజనాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాల్లోని పేద పిల్లలకు 2025-26 విద్యా సంవత్సరం నుండి సన్నబియ్యంతో భోజనం అందించడానికి నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ పథకం కింద 25 కిలోల సంచులలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బియ్యం నాణ్యతను పర్యవేక్షించడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు.

పిల్లలకు పోషకాహారం అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. దీంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇదివరకే పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు.నేటి నుంచి స్కూళ్లు యధావిధిగా పునః ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు ఎప్పటిలానే పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కాగా సోమవారం రోజు నుంచి ఎప్పటిలానే తరగతుల నిర్వహణ కొనసాగుతుందని ఉపాధ్యాయులు వెల్లడించారు.