వైఎస్సార్ 15 వర్దంతి..జగన్‌, బాబులపై షర్మిల హాట్‌ కామెంట్స్‌ !

-

వైఎస్సార్ 15 వర్దంతి సందర్భంగా…జగన్‌, బాబులపై షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ వైయస్ ఆశయమన్నారు. వైయస్ ఆశయానికి తూట్లు పొడిచే పార్టీతో జగన్ కుమ్మక్కయ్యారని తెలిపారు.

AP Congress president YS Sharmila pays tribute at YSR Ghat in Idupulpaya

వైయస్ జగన్, చంద్రబాబు ఇద్దరు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహించారు. వైయస్సార్ ఆశయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ సంక్షేమం, అభివృద్ధి ఎవరు చేయలేదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్ మృతిని విని తట్టుకోలేక చనిపోయిన వారి కి కూడా నివాళి అన్నారు. ఏపీ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతోంది..ఈ 10 ఏళ్లలో రాష్ట్రం లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version