విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న పవన్‌ కళ్యాణ్‌

-

AP Deputy CM Pawan Kalyan visited Ammavari of Vijayawada: విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. సరస్వతీ దేవి అవతారాన్ని విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్… మూల నక్షత్రం పర్వదిన రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి బుధవారం దర్శించుకున్నారు.

AP Deputy CM Pawan Kalyan visited Ammavari of Vijayawada

దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news