రైతులకు శుభవార్త.. పెట్టుబడి రాయితీ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు శుభవార్త అందజేసింది టీడీపీ ప్రభుత్వం. ఏప్రిల్ నెలలో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టాన్ని చవిచూశారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5.37 కోట్ల డబ్బులను విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు.

AP government releases investment subsidy for farmers affected by unseasonal rains
AP government releases investment subsidy for farmers affected by unseasonal rains

ఏప్రిల్ 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విడతల వారీగా కురిసిన వర్షాల కారణంగా పలు జిల్లాలలో పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఉద్యాన శాఖ నివేదికతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీలో అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారు. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news