ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసేవారు. తాజాగా పదోన్నతిపై సీజేగా ఏపీ హైకోర్టుకు వచ్చారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌ తమ్ముడే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌. ధీరజ్ సింగ్​ 1989 అక్టోబరు 18న దిల్లీ, జమ్మూకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్‌ న్యాయవాదిగా హోదా పొంది.. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి సేవలు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news