జగన్‌ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి – హోం మంత్రి అనిత

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్ళ పైనదేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. క్రిమినల్ రాజకీయ నాయకుడు అయితే ఎటువంటి పరినమామలు జరుగుతాయో అర్థం అవుతుందని తెలిపారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం ఉపయోగించిన బోట్లు ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేయడానికి వాడారని పేర్కొన్నారు.


కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి వుంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు. బోట్లు పోయాయి అని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర వుండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయని నిలదీశారు. ఈ ఘటన వెనుక బాధ్యులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికారం అండ‌గా సైకో జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారన్నారు. 5 ఊళ్లు నామరూపాలు లేకుండా చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version