చేనేత కార్మికులకు శుభవార్త..రూ.3 వేలు పెంపు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆప్కో ఉత్పత్తులను సరఫరా చేసే సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల జీతాలను పెంచబోతున్నట్లు ఏపీ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. ఈ సహకార సంఘాల్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల జీతాలు 3000 రూపాయల చొప్పున పెంచబోతున్నట్లు వివరించారు.

AP Minister Savita makes key announcement that the salaries of handloom workers working in cooperatives supplying APCO products will be increased
AP Minister Savita makes key announcement that the salaries of handloom workers working in cooperatives supplying APCO products will be increased

అలాగే ప్రాసెసింగ్ చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బ్లీచింగ్ ఛార్జీలు బండిల్ కు 129 రూపాయల నుంచి 148 రూపాయలకు పెరుగుతున్నట్లు తెలిపారు. అటు డయింగ్ కు 352 నుంచి 434 రూపాయలకు చార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. బెడ్ షీట్ నేత మజూరి 83 రూపాయల నుంచి వంద రూపాయలకు పెరగనున్నట్లు స్పష్టం చేశారు. టవల్ నేత మంజురి 31 రూపాయల నుంచి 40 రూపాయలకు పెరుగన్నట్లు కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news