AP: పెన్షన్ సొమ్ము తీసుకుని సచివాలయ ఉద్యోగి పరారీ..!

-

ఏపీలో నిన్నటి నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. స్వయంగా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా… పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే… ఈ తరుణంలో ఏపీలో దారుణం జరిగింది. పెన్షన్ సొమ్ము తీసుకొని సచివాలయ ఉద్యోగి పరార్ అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

AP: Secretariat employee absconds with pension money..!

7.50 లక్షల పెన్షన్ డబ్బులు తీసుకుని… తోట తరుణ్ కుమార్ అనే సచివాలయ ఉద్యోగి పారిపోయినట్లు తాజాగా గుర్తించారు. గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామంలో తరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు కేవలం ఏపీలోనే జరుగుతున్నాయి. తాజాగా మరో ఉద్యోగి కూడా పెన్షన్ డబ్బులతో పారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news