ఫ్రీ బస్సు… తిరుమల వెళ్లే మహిళలకు అదిరిపోయే శుభవార్త

-

తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ ఇకపై తిరుమల కొండపై కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కీలక ప్రకటన చేశారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని వివరించారు.

TIRUMALA RTC
APSRTC Chairman Konakalla Narayana Rao has revealed that women are being allowed to travel free in RTC buses even to Tirumala Hill.

ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా కొనకల నారాయణరావు వెల్లడించడం జరిగింది. ఆసుపత్రులకు అలాగే పుణ్యక్షేత్రాలకు అటు చిరు ఉద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో ఏపీలోని… మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మొదట కొండపైకి ఫ్రీ బస్సు సదుపాయం… తీసుకురాలేదు ఆర్టిసి. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ఆర్టీసీ దిగివచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news