ఏపీ పేదలకు శుభవార్త…1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు

-

ఏపీ పేదలకు శుభవార్త. ఆర్ 5 జోన్ లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని పేదలకు 1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు చేశారు ఏపీ అధికారులు. నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాలలో లే అవుట్లు ఏర్పాటు చేశారు.

25 లే అవుట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో 50,004 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక అటు హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అమరావతి ప్రాంత రైతులు. కానీ స్టే ఇవ్వటానికి నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ తరుణంలోనే, అదనపు లే అవుట్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version