జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది – అచ్చెన్నాయుడు

-

జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని.. ప్రాజెక్టుల కోసం ఇంకేం ఖర్చు పెడుతుంది..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. పెన్నా టు వంశధార పేరుతో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపడతున్నారని.. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపడతారని వెల్లడించారు అచ్చెన్నాయుడు.

కొన్ని ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేసిన విధానాన్ని ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని.. చంద్రబాబు చేపట్టే పెన్నా టు వంశధార కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చూడొద్దు.. ప్రజా అవగాహన కార్యక్రమంగా చూడాలని కోరారు. జగన్ సహా మంత్రులు.. వైసీపీ నేతలు దోపిడీనే పనిగా పెట్టుకున్నారని.. వ్యవసాయ, సాగునీటి రంగాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు అచ్చెన్నాయుడు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ భ్రష్టు పట్టించారని.. ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు బీజం పడింది.. దాన్ని చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారని.. ఇరిగేషన్ రంగాన్ని ప్రభుత్వం ఎలా గాలికొదిలేసిందో చంద్రబాబు ఇప్పటికే వివరించారని చెప్పారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news