నెల్లూరు జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య!

-

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మందాటి మౌనిక, ఆమె తండ్రి, అమ్మమ్మ హత్యకి గురయ్యారు. హత్యకి గురైన మౌనిక మరిది మౌళీ, అతని తండ్రి మాల్యాద్రి కలిసి ఈ దురాగదానికి పాల్పడినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల మౌనిక భర్త రైల్వే ఉద్యోగి మధుసూదన రావు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అన్న ఆస్తికోసం మరిది, అతని తండ్రి కలిసి హత్య చేసినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో మాల్యాద్రి ఉత్తర క్రియలు జరగనుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. మధుసూదన్ రావు ఉత్తర క్రియల కోసం తురిమెర్ల నుంచి కొండబిట్రగుంటకు వచ్చింది మౌనిక. తండ్రి వాడకుప్పం కృష్ణయ్య (75) అమ్మమ్మ శాంతమ్మ (78).

ఇదే అదనుగా భావించి మౌళీ అతని తండ్రి మాల్యాద్రి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బందువులు ఇంటికి చేరుకోగా ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి, బోగోలు పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితులుగా ఉన్న మౌళి అతని తండ్రి మాల్యాద్రి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. క్లూస్ టీం ద్వారా నిందితుల కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news