జగన్ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి – నారా లోకేష్

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 184 రోజు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. జననిరాజనం మధ్య నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రావెల శివారు క్యాంప్ సైట్ నుండి నేడు పాదయాత్ర ప్రారంభమైంది.

పొన్నెకల్లు లో ముస్లిం సామాజిక వర్గాలతో సమావేశం అయ్యారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వక్ఫ్ బోర్డుకు చెందిన వేలకోట్ల భూములను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. విదేశీ విద్యను చంద్రబాబు తీసుకువస్తే.. జగన్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యను మళ్ళీ అమలు చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news