వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా

-

సోమవారం సిబిఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకు విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను కూడా అధికారులు కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం వివేక హత్య కేసు విచారణనను సిబిఐ కోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.

అలాగే నాలుగు రోజుల క్రితం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కి కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. సిబిఐ డైరెక్టర్ కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వివేక హత్య కేసులో దర్యాప్తును పునసమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news