జగన్ బిస్కెట్ లకు ఆశపడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు !

-

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీద టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్ష్యుడు బచ్చుల అర్జునుడు ఘాటైన కామెంట్స్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ నోటిని అదుపులో పెట్టుకోవాలన్న ఆయన డాక్టర్ రమేష్ పై చేసిన వ్యాఖ్యలను వంశీ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ వేసే బిస్కెట్ లకు ఆశపడి వంశీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, స్వర్ణా హోటల్ ప్రమాదంతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని బచ్చుల పేర్కొన్నారు.

ప్రభుత్వం కోరిన మీదటే స్వర్ణా హోటల్ లో కొవిడ్ సెంటర్ ను రమేష్ పెట్టారని ఆయన అన్నారు. హోటల్ లో కొవిడ్ ఆస్పత్రి పెట్టేముందు తనిఖీలు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో వైద్యశాఖ నిద్రపోతోందా? అని ప్రశ్నించిన ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా వంశీ మోహన్ తాడేపల్లి స్క్రిప్ట్ చదివేస్తున్నారని అన్నారు. రమేష్ హాస్పిటల్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముందని, తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది వల్లభనేని వంశీ నిన్న ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news