పద్మావతి ఎక్స్ ప్రెస్ రైల్ లో దారుణం..ఇద్దరిని బయటకు తోసేసిన దుండగులు

-

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు లో దారుణం జరిగింది. ఓ ప్రయాణికున్ని ఇద్దరు దుండగులు బయటకు తోసేశారు. దీంతో ప్రయాణికుడు రమేష్ కు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రి కి తరలించారు. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రైల్లో సీటు కోసం గొడవపడిన వారికి నచ్చచెప్పినందుకు రైల్లో నుండి ప్రయాణికుడిని తోసేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ప్రమాదంలో రమేష్ కుమార్ అనే ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు అన్నమయ్య జిల్లా పిటిఎం మండలం కుమ్మవారి పల్లెకు చెందిన రమేష్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. కింద పడ్డ తర్వాత, బాధితుడే 108కు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించింది సిబ్బంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news