రేపటి నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షా విరమణలు

-

 

రేపటి నుంచి విజయవాడ అమ్మ భవానీ దీక్షా విరమణలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ కర్ణాటక ఒరిస్సాల నుంచి భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు విజయవాడ దుర్గగుడి అధికారులు. దీక్షా విరమణలకు హోమగుండాలను ఏర్పాటు చేశారు.

Bhavani Diksha retreats to start from tomorrow

ఉదయం 6:30 గంటల నుంచీ భవానీ దీక్షా విరమణలు ప్రారంభం అవుతాయి. పున్నమి, కృష్ణవేణి, సీతమ్మ పటదాలు ఘాట్లలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కేశఖండన శాల, క్లోక్ రూం లను సిద్ధం చేశారు. ప్రతి అరగంటకు ఉచిత బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశుధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్ ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. భవానీలకు అమ్మవారి కుంకుమ, అన్నప్రసాదం అందించనున్నారు విజయవాడ దుర్గగుడి అధికారులు, పాలకమండలి. మెడికల్ క్యాంపులను వినాయకుడి గుడి వద్ద నుంచీ, మెట్ల మార్గం వైపు, గిరిప్రదక్షిణ చేసే దగ్గర ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో, గిరిప్రదక్షిణ మార్గంలో మజ్జిగ, పాలు, నీళ్ళు అందించనున్నారు విజయవాడ అమ్మవారి గుడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version