తిరుమలలో జగన్ పర్యటనను అడ్డుకునే హక్కు టీటీడీకి లేదు – భూమన

-

జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను అడ్డుకునే హక్కు టీటీడీ పాలక మండలికి లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హిందువులంటే కేవలం బిజెపి కార్యకర్తలేనా అంటూ నిలదీశారు భూమన. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భూమన ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

తిరుమలకు జగన్ మోహన్ రెడ్డి వస్తుంటే గజగజ వణికిపోతున్నారని… కూటమి నేతలకు భయం అవుతుందని… భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ని డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు. హిందువులంటే బిజెపి కార్యకర్తలే… అందరూ కూడా ఆ హిందువులేనని తెలిపారు. ఎప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version