జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ

-

ఏపీ ప్రజల కోసం యాగం మొదలు పెట్టారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. అయితే… ఈ యాగం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేసిన భూమి పూజ అని కాసేపటి క్రితమే ప్రకటించారు.

భూమాత ప్రీత్యర్థం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేపట్టారు. కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఓ వైపు భూమి పూజ, మరో వైపు యాగ నిర్వహణతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version