త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు భూమి పూజ : సీఎం రమేష్

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. రాష్ట్రం నుంచి కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఉండటంతో రాష్ట్రానికి మరో కొత్త రైల్వే జోన్ కూడా రాబోతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా సీఎం రమేష్ అధికారికంగా ప్రకటించారు.  అత్యంత త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు భూమి పూజ జరుగుతుందని కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తెలిపారు.

కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా ఎంపికైన తరువాత తొలిసారిగా విశాఖకు వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కు భూమి పూజ జరుగుతుందని.. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావాల్సిన భూమిని రైల్వే శాఖకు అందించారని తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కృషి చేస్తానన్నారు. అంతకు ముందు బీజేపీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ మాజీ శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ ఎంపీ రమేష్ కి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news