జనసేన జన్మస్థానం తెలంగాణ.. కర్మ స్థానం ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్

-

పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే.. కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో తనకు కరెంట్ షాక్ వచ్చి చనిపోయేవాడినని.. ఆ కొండగట్టు ఆంజనేయస్వామి దయ, ప్రజల ఆశీస్సులతోనే బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా గద్దర్ ను కూడా గుర్తు చేశారు. గద్దర్ బండెనక బండి పాట పాడారు.

Pawan Kalyan

కోటీ రతనాల వీణ తెలంగాణ అని పవన్ కళ్యాణ్ పలకడం అందరినీ ఆకట్టుకుంది. తనకు భయం లేదు కాబట్టే అంత నిర్వీరామంగా పోరాడానని తెలిపారు. దాదాపు పదేళ్లుగా ఎన్నో అవమానాలు పడ్డానని.. అవే ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయినట్టు తెలిపారు. గత ఐదేళ్ల అరాచకపాలనను దించేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version