ఏపీ అప్పులపై నిర్మలా సీతారామన్ కు పురంధేశ్వరి లేఖ

-

ఏపీ అప్పులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే విధంగా అప్పులు చేసిందనే వివరాలను లేఖలో పేర్కొన్న పురంధేశ్వరి… నాలుగేళ్ల వైసీపీ పాలనలో రూ. 7.15 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని లేఖలో వెల్లడించారు.

ఉద్యోగులకివ్వాల్సి పీఎఫ్ క్లైమ్స్.. డీఏలు కూడా భారీగా పెండింగులో ఉన్నాయన్న పురంధేశ్వరి…లిక్కర్ ఇన్కం తాకట్టు పెట్టి ఇప్పటికే తీసుకున్న అప్పులే కాకుండా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతోన్న ఆర్థిక అవకతవకలపై సమీక్షించాలని నిర్మలా సీతారామన్ను కోరారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version