ఆంధ్ర ప్రదేశ్ లో BJP టార్గెట్ కోటి..!

-

దేశ వ్యాప్తంగా BJP పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రాల వారిగా టార్గెట్స్ పెట్టుకొని పని చేస్తున్నారు నాయకులు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ డిప్యూటీ సీఎం అశోక్ కీలక వ్యాఖ్యలు చేసారు. భారతీయ జనతా పార్టీని పటిష్ట పరిచేలా అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం అని తెలిపారు.

అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కోటి మందిని సభ్యులను చేయాలని అనుకున్నాం. కర్ణాటక లో 1.70కొట్లు అంచనా తో ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు అశోక్. ప్రతి ఇంటికి వెళ్ళండి ఇద్దరు లేదా ముగ్గురిని సభ్యత్వ నమోదు చేసేలా ప్రయత్నం చేయండి అని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. గతంలో 2 శాతం ఉన్న తమిళనాడు లో ఈసారి 12 శాతం ఓట్లు సాధించగలిగాం. అలాగే గతంలో కర్ణాటకలో ఇద్దరు బిజెపి ఎమ్మేల్యే ఉన్నారు.అలాంటిది ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రతి పక్ష స్థానంలోకి వచ్చాం అని అశోక్ పేరొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news