విశాఖ ఎంపీగా బొత్స సత్యనారాయణ సతీమణి ?

-

విశాఖ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ విశాఖ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా, బొత్స ఝాన్సీ గతంలో ZP చైర్ పర్సన్ గా, లోక్ సభ ఎంపీగా పనిచేశారు.

ఇది ఇలా ఉండగా, కమెడియన్ ఆలీకి బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కమెడియన్ ఆలీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రచారం జరుగుతుంది. వైసీపీ తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలనే భావిస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల వైసిపి సామాజిక సాధికారత యాత్రలో కూడా పాల్గొన్నారు. ఆలీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news