తెనాలిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి కన్నుమూత

-

ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో రెండు రోజుల కిందట  దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐతా నగర్ కి చెందిన యువతి పై నవీన్ అనే వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. యువతిని కారులో నవీన్ తీసుకువెళ్లాడు. కొద్ది సేపటి తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన  యువతిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెళ్లి పోయాడు నవీన్. యువతిని పరిశీలించిన వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు.ః

ఆ యువతి బర్త్ డే కావడం.. నవీన్ అనే వ్యక్తికి ఆ యువతికి గొడవ జరగడంతో యువతిని నవీన్ గట్టిగా కొట్టడంతో కోమాలోకి పోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తాజాగా ఆ యువతి తుది శ్వాస విడిచింది. ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు యువతిని కోమాలోకి వెళ్లేలా కొట్టిన  నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  అనుచరుడు అంటూ వైసీపీ నేతలు పేర్కొనడం  గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version